ప్రజావాణిలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గౌరవనీయులైన పింకేష్ కుమార్ (ఐ ఏ ఎస్) గారిని కలిసిన సామాజిక పర్యావరణ ప్రేమికులు, కోల రవీందర్ ముదిరాజ్, నగరంలో నాణ్యతలేని సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇస్తరాకులు, ఫంక్షన్ హాల్స్, రైతు బజార్, వారాంతపు అంగట్లో, హోటల్స్, దేవస్థానాల వద్ద, క్యాటరింగ్ సెంటర్లు, విచ్చలవిడిగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్నారు. ఫంక్షనల్ యజమానులు, వేలాది రూపాయల అద్దె తీసుకొని స్టీల్ ప్లేట్లు ఇవ్వకుండా ప్లాస్టిక్ ఇస్తరాకుల్లో భోజనాలు వడ్డిస్తున్నారు. తినుబండారాల టిఫిన్ సెంటర్లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారు. దీనికి స్పందించిన కమిషనర్ గారు వెంటనే సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినారు. ఫంక్షన్ హాల్ యజమానులను హోటల్ యజమానులను దేవస్థాన అధ్యక్ష కార్యదర్శులను పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అన్ని సర్కిల్ కమిషనర్లకు ఉత్తర్వులు ఇచ్చినారు.
తదుపరివారికి నోటీసులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ వల్ల గోమాత జలమాత మానవుల ఆరోగ్యాలు కలుషితమవుతున్నాయి. వర్షం పడ్డప్పుడు డ్రైనేజీలలో ప్లాస్టిక్ నిండిపోయి కాలనీలు మునిగిపోతున్నాయి, మొన్న హైడ్రా, డ్రైనేజీలు క్లీన్ చేస్తుంటే టన్నులకొద్ది ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్, ఇస్తరాకులు, బయటపడ్డాయి.
వెంటనే స్పందించినందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది
