Mon, 20 Jul 2026
🔴 BREAKING
జేఎన్టీయూ లో కొంత మంది అధ్యాపకులు చేస్తున్న విద్యార్థి వ్యతిరేక ప్రతీకార చర్యలు, ఉపకులపతి నీ సంతుష్టీకరణ చేయడానికి అధ్యాపకులు జారీ చేస్తున్న ఉత్తర్వులపై, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న అధ్యాపకులు విద్యార్థులను బహిరంగంగానే బెదిరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం లో ఆధారాలతో ఫిర్యాదు_ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం Yashoda Hospitals, Somajiguda Achieves “Guinness World Records™” Recognition for Landmark IBD Awareness Initiative Director of School Education Releases NSPC 2026 Poster; Calls for Massive Student Participation Across Telangana Landmark Orientation Meeting on Atal Tinkering Labs (ATL) and PM SHRI Schools ప్రకటన న్యూస్
Uncategorized

ప్రకటన న్యూస్

ఎల్‌బీ స్టేడియంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ప్రకటన న్యూస్, హైద్రాబాద్, 14 జూలై, 2026: ప్రకటన న్యూస్ ప్రతినిధి: బి. అనిత

హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ గారు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ శ్రీ కనకదుర్గ అమ్మవారి కరుణాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మామిడి గోపి, కమిటీ సభ్యులు, భక్తులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *