జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, సంక్షేమం కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తనకు శక్తి, సామర్థ్యం ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నారు.
