Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

గాంధీభవన్లో అంబరాన్నంటిన ఆషాడ మాస బోనాల సంబరాలు.

గాంధీభవన్లో ఆషాడ మాస బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క గారి ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన పండుగ బోనాల పండగ మన తెలంగాణ సాంస్కృతికి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగను మహిళలు ఎంతో సుచి శుభ్రతతో నిష్టగా నిర్వహిస్తారని వారు అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కృషి రాష్ట్రం షష్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని వారు అన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, ఆషాడ మాసం ఆరంభంతోనే అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయని, బోనాలు పోతరాజులు శివసత్తుల ఆటలతో ఆషాడ మాసం అంతా అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటారని వారు అన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు అందరూ భారీ ఎత్తున మహిళలు పాల్గొని బోనాల సంబరాలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *