గ్రంథాలయ పితామహుడు ప్రొఫెసర్ యస్ ఆర్ రంగనాథన్ 134వ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ అధ్యక్షుడు ఎంబి కృష్ణ యాదవ్ ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ లైబ్రరీని సందర్శించి కాలేజ్ లైబ్రేరియన్ డాక్టర్ క్రొత్త విద్యా సాగర్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయం విద్యాలయానికి గుండెకాయ వంటిదని, మానవ మనుగడ, అభివృద్ధి, మానసిక అభివృద్ధి కేవలం నిరంతర పుస్తక పఠన, గ్రంథాలయంలో సమయాన్ని వెచ్చించడం ద్వారానే జరుగుతుందని వారు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధిని విస్మరిస్తే విద్యార్థుల విద్యాప్రగతికి ఆటంకం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇట్టి కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా టి జి వో అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తిరుపతి, గోపి సురేందర్, భాను ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
