Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

రవీంద్రభారతిలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భావజాల వ్యాప్తికర్త, ఆచార్య జయశంకర్ 92వ జయంతి వేడుకలను గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంఎల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఎల్వీ రమణ, తకెళ్ళపల్లి రవీందర్ రావు, అంజిరెడ్డి, ప్రముఖ మేధావి ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భావాజాల వ్యాప్తికి కృషి చేసి ప్రజల గుండెలో ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా నిలిచిపోయిరని కొనియాడారు.

ప్రముఖ వక్తలు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన వైచారిక మార్గదర్శకత్వం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నలుమూలలకూ వ్యాప్తి చేయడంలోనూ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా దిశానిర్దేశం చేయడంలోనూ ఆయన పాత్ర అమూల్యమైనదని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ ఇంచార్జ్ సహాయ సంచాలకుడు పి. నర్సింలు, ఏఓ డా. పి. విజయకుమార్, సలహా మండలి సభ్యులు దినకర్, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సిబ్బంది మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు పాడి అలరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *